జగన్ చరిత్ర హీనుడు: కేశవ్
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:33 AM
కుట్రలతో రాజకీయాలు చేయడమే తప్ప.. జగన్కు రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్టదని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: కుట్రలతో రాజకీయాలు చేయడమే తప్ప.. జగన్కు రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్టదని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఏదో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కుట్రలు చేసే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు. ఆయనలా ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడితే రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించారు.