Share News

Tirumala: రథసప్తమికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:32 AM

సూర్యజయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్పస్వామి...

Tirumala: రథసప్తమికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

తిరుమల, జనవరి18(ఆంధ్రజ్యోతి): సూర్యజయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్పస్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో ఈ వేడుకను ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. ఈఏడాది రథసప్తమి ఆదివారం రావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారనే ఆంచనాతో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆరోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహించనున్నారు.

25న ఏడు వాహనాలపై దర్శనమివ్వనున్న మలయప్ప

వాహనసేవ వివరాలు

  • సూర్యప్రభవాహనం: ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం 6.45 గంటలు)

  • చిన్నశేష వాహనం: 9-10గంటలు

  • గరుడ వాహనం: 11-12గంటలు

  • హనుమంత వాహనం: 1-2గంటలు

  • చక్రస్నానం: 2-3గంటలు

  • కల్పవృక్ష వాహనం: 4-5గంటలు

  • సర్వభూపాల వాహనం: 6-7గంటలు

  • చంద్రప్రభ వాహనం: 8-9గంటలు

Updated Date - Jan 19 , 2026 | 04:32 AM