విద్యాభివృద్ధికి లోకేశ్ కృషి భేష్
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:01 AM
ఏపీలో విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి బాగుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
భోగాపురంలో పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ సందర్శన
విజయనగరం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఏపీలో విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి బాగుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను ధర్మేంద్ర ప్రధాన్, లోకేశ్లు మంగళవారం సందర్శించారు. ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న విద్యార్థి ప్రోగ్రెస్ కార్డ్, అసె్సమెంట్ బుక్లెట్ గురించి కేంద్రమంత్రికి లోకేశ్ వివరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్, స్నాక్స్లను కేంద్రమంత్రి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని కేంద్రమంత్రి రుచి చూశారు. ‘కానా అచ్చాహై (ఆహారం బాగుంది)’ అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.