జగన్ కోసం ‘ఆత్మాహుతి దళం’ అవుతాం: ధర్మాన కృష్ణదాసు
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:36 AM
టీడీపీ దాడులను తిప్పి కోట్టేందుకు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆత్మాహుతి దళంలా పని చేస్తామని వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ దాడులను తిప్పి కోట్టేందుకు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆత్మాహుతి దళంలా పని చేస్తామని వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులో టీడీపీ వర్గాల దాడిలో దెబ్బతిన్న మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిని ఆయన మంగళవారం పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇలాంటి దాడులను ప్రోత్సహించడం దారుణమమన్నారు.