Share News

బత్తలపల్లికి చేరిన సీపీఐ పాదయాత్ర

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:21 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి బత్తలపల్లి మండలం సంజీవపురం కాటక్షేత్రానికి చేరుకుంది.

బత్తలపల్లికి చేరిన సీపీఐ పాదయాత్ర
రామకృష్ణకు స్వాగతం పలుకుతున్న సీపీఐ నాయకులు

బత్తలపల్లి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి బత్తలపల్లి మండలం సంజీవపురం కాటక్షేత్రానికి చేరుకుంది. ఈ పాదయాత్ర మండల సరిహద్దు యర్రాయపల్లి వద్దకు చేరుకోగానే సీపీఐ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి పాదయాత్రగా సంజీవరం సమీపంలోని కాటకోటేశ్వర క్షేత్రం వద్దకు చేరుకున్నారు. రాత్రి కాటమక్షేత్ర సమీపంలోని టీటీడీ కల్యాణమండపంలో బసచేశారు. ఈ పాదయాత్రకు వైసీపీ నాయకులు బగ్గిరి బయపరెడ్డి, ముష్టూరు నరసింహారెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ పాదయాత్రలో సీపీఎం శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సీపీఐ జిల్లాకార్యదర్శి వేమయ్యయాదవ్‌, కాటమయ్య, సీపీఐ నియోజకవర్గకార్యదర్శి ముసుగు మధు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:21 AM