Share News

ఆవుపెయ్యికి నామకరణ ఉత్సవం

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:21 AM

విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం ఆవుపెయ్యికి నామకరణ ఉత్సవం నిర్వహించారు.

ఆవుపెయ్యికి నామకరణ ఉత్సవం

విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం ఆవుపెయ్యికి నామకరణ ఉత్సవం నిర్వహించారు. గతంలో ఈ ఆలయ అర్చకుడికి ఒక దాత ఆవును దానంగా ఇచ్చారు. ఆ ఆవుకు ఈ నెల 4న పెయ్యి దూడ పుట్టింది. ఆ దూడకు 11వ రోజైన శనివారం గ్రామపెద్దలు, యువతను పిలిచి నామకరణ ఉత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆవు పెయ్యిని ఉయ్యాల్లో ఉంచి, గోపికసావిత్రి అని నామకరణం చేశారు. వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. నామకరణ ఉత్సవం నిర్వహించిన అర్చకుని కుటుంబాన్ని అభినందించారు.

- జామి, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 15 , 2026 | 04:21 AM