సీఎంతో ఉబర్ ప్రతినిధుల భేటీ
ABN , Publish Date - May 15 , 2026 | 05:13 AM
ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ టీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ టీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ డిన్నర్ భేటీలో ఉబర్ సీఈవో దారా ఖొస్రోషాహితోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీలో టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్పై విస్తృతంగా చర్చించారు. గ్లోబల్ లీడర్లతో చర్చలెప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని లోకేశ్ ఎక్స్లో పేర్కొన్నారు.