నేడు పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:20 AM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. ఉదయం 11.20 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు ఆయన అక్కడే గడపనున్నారు.
టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై నేతలతో చర్చలు
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. ఉదయం 11.20 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు ఆయన అక్కడే గడపనున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దానిపై పార్టీ నేతలతో సీఎం చర్చించనున్నారు. జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.