Share News

ప్రజలకు మంచి చేస్తే జగన్‌ ఓర్చుకోలేడు: బ్రహ్మం

ABN , Publish Date - May 31 , 2026 | 06:57 AM

ప్రజలకు జగన్‌ మంచి చేయడని, ఎదుటివారు చేస్తే ఓర్చుకోలేడని, అందుకే మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని..

ప్రజలకు మంచి చేస్తే జగన్‌ ఓర్చుకోలేడు: బ్రహ్మం

అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు జగన్‌ మంచి చేయడని, ఎదుటివారు చేస్తే ఓర్చుకోలేడని, అందుకే మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల పాలనలో ఇటు నోటిఫికేషన్లు వేయక.. అటు కంపెనీలను తరిమికొట్టి నిరుద్యోగులను నిలువునా ముంచేసిన దుర్మార్గుడు ఇప్పుడు డీఎస్సీ కోసం రాత్రీపగలు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16వేల మంది కష్టాన్ని అవమానిస్తున్నాడు’ అని విమర్శించారు.

Updated Date - May 31 , 2026 | 06:57 AM