ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: బొప్పరాజు
ABN , Publish Date - May 01 , 2026 | 04:04 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి తక్షణమే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు...
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి తక్షణమే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేసినట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.