ఖర్గే వ్యాఖ్యలు దుర్మార్గం.. అరెస్టు చేయాలి: మాధవ్
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:21 AM
ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులను పాములతో పోల్చి వాటిని ఎలా చంపాలో మీ ఇష్టం అంటూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు....
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ‘ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులను పాములతో పోల్చి వాటిని ఎలా చంపాలో మీ ఇష్టం అంటూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక వర్గంపైకి మరో వర్గాన్ని రెచ్చగొడుతున్న ఖర్గేను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.