సీబీఎస్ఈ పది ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్ విజయభేరి
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:48 AM
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని...
గుంటూరు(విద్య), ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థి ఎ.సంతోష్ కుమార్ 500 మార్కులకుగానూ 491 మార్కులు సాధించి భాష్యంకు గర్వకారణంగా నిలిచారన్నారు. 16 మంది 480కి పైగా మార్కులు సాధించినట్టు వివరించారు. విద్యార్థులను భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తదితరులు అభినందించారు.