విశాఖలో మెరైన్ గ్యాస్ టర్బైన్ రిపేర్ సెంటర్
ABN , Publish Date - May 21 , 2026 | 04:59 AM
దేశంలోనే ప్రైవేటు రంగంలో తొలి మెరైన్ గ్యాస్ టర్బైన్(ఎంజీటీ) రిపేర్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో భారత్ ఫోర్జ్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్ర ప్రభుత్వంతో భారత్ ఫోర్జ్ సంస్థ ఒప్పందం
రెండు దశల్లో నిర్మాణం...750 మందికి ఉపాధి
విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): దేశంలోనే ప్రైవేటు రంగంలో తొలి మెరైన్ గ్యాస్ టర్బైన్(ఎంజీటీ) రిపేర్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో భారత్ ఫోర్జ్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి నేవల్ డాక్యార్డులోని 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ను నిర్మిస్తారు. అందులో మెరైన్ గ్యాస్ టర్బైన్లకు మరమ్మతులతోపాటు ఓవర్హాలింగ్ కూడా చేస్తారు. దాంతో పాటు ఎంజీటీలను దేశీయంగా అభివృద్ధి చేసే వసతులు సమకూరుస్తారు. రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఇది దోహదపడనుంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల్లో ఎంజీటీలు చాలా కీలకపాత్ర పోషిస్తాయి.