సీఎంను కలిసిన బండ్ల గణేశ్
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:50 AM
సినీ నిర్మాత బండ్ల గణేశ్ మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశారు. స్కిల్ డెవల్పమెంట్ కేసులో చంద్రబాబు ...
తిరుమల ప్రసాదం అందజేత
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సినీ నిర్మాత బండ్ల గణేశ్ మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశారు. స్కిల్ డెవల్పమెంట్ కేసులో చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తానని బండ్ల గణేశ్ మొక్కుకున్నారు. తాజాగా మొక్కు తీర్చుకున్న ఆయన సీఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశారు. తిరుపతి ప్రసాదం అందించారు. అనంతరం మంత్రి లోకేశ్నూ బండ్ల గణేశ్ కలిశారు.