Share News

18న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు: ఏపీటీఎఫ్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:09 AM

విద్యారంగ సమస్యలు, ఆర్థిక పరమైన డిమాండ్ల సాధన కోసం రెండో దశ పోరాటంలో భాగంగా ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని...

18న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు: ఏపీటీఎఫ్‌

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలు, ఆర్థిక పరమైన డిమాండ్ల సాధన కోసం రెండో దశ పోరాటంలో భాగంగా ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఏపీటీఎఫ్‌-257 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.బసవలింగారావు తెలిపారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల కిందట రిటైరైన ఉద్యోగులకు మాత్రమే పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఇతర బకాయిలు చెల్లిస్తూ.. రూ.7034 కోట్లు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సరెండర్‌ లీవులు, 11వ పీఆర్‌సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 04 , 2026 | 04:10 AM