ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:42 AM
ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ పిరియాడికల్ హెల్త్ చెకప్ అమలును తప్పనిసరి చేస్తున్నట్టు....
45 ఏళ్లు పైబడిన వారికి హెల్త్ చెకప్ తప్పనిసరి
ఆర్టీసీ ఎండీ ఎన్.బాలసుబ్రహ్మణ్యం వెల్లడి
బస్స్టేషన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ పిరియాడికల్ హెల్త్ చెకప్ అమలును తప్పనిసరి చేస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. ఇటీవల ఉద్యోగుల్లో.. ముఖ్యంగా డ్రైవర్లలో గుండె సంబంధిత సమస్యలు, ఇతర వ్యాధుల కారణంగా మరణాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకే పిరియాడికల్ హెల్త్ చెక్పలు నిర్వహిస్తున్నారు. ఇకపై 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకొకసారి హెల్త్ చెకప్ తప్పనిసరి చేసినట్టు తెలిపారు. మే 1 నుంచి ఈ కార్యక్రమం అన్ని డిపోల్లోనూ అమలులోకి వస్తుందన్నారు.