ప్రశాంతంగా ఏపీసెట్
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:15 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి...
తొలిరోజు 81.38శాతం హాజరు
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి నిర్వహించే ఏపీ సెట్-2025 శనివారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 65 కేంద్రాల్లో మూడు సెషన్స్లో 30 సబ్జెక్టుల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. తొలిరోజు శనివారం పది సబ్జెక్టుల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 9,359 మంది హాజరుకావాల్సి ఉండగా, 7,617 మంది (81.38 శాతం) హాజరయ్యారు.