Share News

Chief Secretary Vijay Anand: విద్యుత్‌ నష్టాలను తగ్గించాం

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:07 AM

విద్యుత్‌ సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడంతో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

Chief Secretary Vijay Anand: విద్యుత్‌ నష్టాలను తగ్గించాం

  • విద్యుత్‌ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో సీఎస్‌

అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడంతో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల డైరీని బుధవారం ఆయన విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలు సుమారు 9.6 శాతానికి తగ్గగా, ట్రాన్స్‌కో నష్టాలు 2.6 శాతానికి తగ్గాయన్నారు. జెన్కో ఎండీ నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌, సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 06:08 AM