టీచర్లందరినీ విద్యాశాఖ పరిధిలోకి తేవాలి
ABN , Publish Date - May 23 , 2026 | 05:22 AM
ఉపాధ్యాయ సర్వీసులన్నిటినీ విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
సీఎస్కు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి
ఇంటర్నెట్ డెస్క్: ఉపాధ్యాయ సర్వీసులన్నిటినీ విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఏపీఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం-2025 ప్రకారం విద్యాశాఖలోని వివిధ రెండు మేనేజ్మెంట్ల పోస్టులను లోకల్ క్యాడర్గా గుర్తించాలని కోరారు.