గ్రామీణ పేదలకు 74 వేల ఇళ్లు: కొలుసు
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:22 AM
రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 వేల ఇళ్లు మంజూరు చేసిందని, భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 వేల ఇళ్లు మంజూరు చేసిందని, భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గతేడాది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద 57,600 ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 684 ఇళ్లు పీఎం-జనమన్ పథకం కింద 28,430 ఇళ్లు.. మొత్తం 86,714 ఇళ్లు రాష్ట్రానికి మంజూరయ్యాయని మంత్రి తెలిపారు.