పీఈసెట్లో 89.76 శాతం అర్హత
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:09 AM
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ పీఈసెట్ ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విడుదల చేశారు
ఇంటర్నెట్ విభాగం: బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ పీఈసెట్ ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విడుదల చేశారు. 4037 మంది సెట్కు రిజస్టర్ చేసుకోగా 2958 మంది పరీక్ష రాశారు. 2655 మంది(89.76శాతం) అర్హత సాధించగా.. ఇందులో పురుషులు 1993, మహిళలు 662 మంది ఉన్నారు. బీపీఈడీ కోర్సుకు 2396, డీపీఈడీ కోర్సుకు 259 మంది అర్హత సాధించారు.