నేడు ఎంఈఆర్పై కీలక సమావేశం
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:02 AM
రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదిక(ఎంఈఆర్)పై సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం ప్రత్యేక సమావేశం జరగనుంది.
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదిక(ఎంఈఆర్)పై సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఐదవ బ్లాక్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్వోడీలు సమావేశానికి హాజరుకానున్నారు. తొలుత సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ సీఎస్ ప్రసంగించనున్నారు.