గ్రూప్-1 కేసులో ప్రొఫెసర్ల వాంగ్మూలాలు నమోదు
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:42 AM
గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాల కేసులో ఇద్దరు ప్రొఫెసర్లు న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
విజయవాడ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాల కేసులో ఇద్దరు ప్రొఫెసర్లు న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇద్దరు ప్రొఫెసర్లను అధికారులు మంగళవారం విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకువచ్చారు. వారిద్దరూ న్యాయాధికారి శ్రీకాంత్కు తమ వాంగ్మూలాలను ఇచ్చారు.