రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక మంత్రికి ఏపీ జేఏసీ అమరావతి కృతజ్ఞతలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:45 AM
రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యమిస్తూ చర్యలు తీసుకున్నందుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు..
అమరావతి/విజయవాడ అర్బన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యమిస్తూ చర్యలు తీసుకున్నందుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్రావు, అసోసియేట్ చైర్మన్ టీ.వీ.ఫణి పేర్రాజు, కోశాధికారి తిమ్మ సత్తి నాగేశ్వరరావు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.