పోటీ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే క్రీడా రిజర్వేషన్లు
ABN , Publish Date - May 15 , 2026 | 05:22 AM
క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే 3 శాతం రిజర్వేషన్లలో కొన్ని సవరణలు చేసింది.
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే 3 శాతం రిజర్వేషన్లలో కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హత కలిగిన క్రీడాకారులు 3శాతం రిజర్వేషన్లు పొందాలంటే ఇకపై ఆయా శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుంది.