AP Government: జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లు
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:05 AM
జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నియామక ఉత్తర్వులు జారీ
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల సంస్థలకు 13 మందిని చైర్మన్లుగా నియమించింది. శ్రీకాకుళం- పీరికట్ల విఠల్రావు, విజయనగరం- దొడ్డక రామకృష్ణ, విశాఖపట్నం- వన్నంరెడ్డి సతీశ్ కుమార్, తూర్పుగోదావరి- భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ(సాయిబాబ రాజు), పశ్చిమగోదావరి- జుట్టిగ నాగరాజు, కృష్ణా- ఎం.ఎస్ బేగ్, గుంటూరు- వందన దేవి, ప్రకాశం- సుచిత్ర ముప్పవరపు, నెల్లూరు- శాంతకుమారి, చిత్తూరు- రెడ్డివారి గురవారెడ్డి, కడప- భానుప్రకాశ్ దాసరి, కర్నూలు- తుగ్గలి నాగేంద్ర, అనంతపురం- వడ్డే వెంకట్ను నియమించింది. రెండేళ్లపాటు వీరు చైర్మన్లుగా కొనసాగుతారు.