కిసాన్ డ్రోన్లతో వ్యవసాయ యంత్రాల బ్యాంకులు
ABN , Publish Date - May 08 , 2026 | 06:00 AM
కిసాన్ డ్రోన్లతో గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకుల ఏర్పాటు కోసం ఎంప్యానల్ అయిన ఏజెన్సీని మరో ఏడాది కొనసాగించడానికి..
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): కిసాన్ డ్రోన్లతో గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకుల ఏర్పాటు కోసం ఎంప్యానల్ అయిన ఏజెన్సీని మరో ఏడాది కొనసాగించడానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.52.16కోట్లకు గడువు ముగిసినందున ఆ నిధులను వినియోగించడానికి 2024-25లో ఎంప్యానల్ అయిన ఏజెన్సీని ఈ ఏడాది కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.