Share News

AP Cabinet Sub-Committee: రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ఉపసంఘం భేటీ

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:40 AM

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం...

AP Cabinet Sub-Committee: రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ఉపసంఘం భేటీ

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది. కమిటీ సభ్యులు పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల రిటైర్మెంట్‌ వయసు పరిమితితో 2,831 మంది ఉద్యోగులు ఇప్పటికే కొనసాగుతున్నారు. దీంతో మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లు, 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్‌ వయసు పెంపుపై చర్చించారు.

Updated Date - Jan 06 , 2026 | 05:40 AM