50 పేజీలు... గంటా 13 నిమిషాలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:12 AM
బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ గంటా 13 నిమిషాల్లో పూర్తిచేశారు. బడ్జెట్ పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి 80 పేజీలు రూపొందించగా...
ఇంటర్నెట్ డెస్క్: బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ గంటా 13 నిమిషాల్లో పూర్తిచేశారు. బడ్జెట్ పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి 80 పేజీలు రూపొందించగా, అందులో తెలుగు ప్రసంగం 50 పేజీలను చదివారు. ఉదయం 11.21గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించి, 12.34గంటలకు ముగించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ను చదివి అవగాహన పెంచుకునేందుకు ఆది, సోమవారాల్లో సభకు విరామం ఇచ్చారు.