రెవెన్యూ లోటు తగ్గడం శుభపరిణామం
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:51 AM
‘బడ్జెట్లో వ్యయం పెరిగినప్పటికీ రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గడం కూటమి ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు ప్రతిబింబం.
ఇంటర్నెట్ డెస్క్: ‘బడ్జెట్లో వ్యయం పెరిగినప్పటికీ రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గడం కూటమి ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు ప్రతిబింబం. బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందిస్తోన్న మద్దతు, కూటమి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో డబులింజన్ సర్కార్ ఏపీని ప్రగతి పథంలోకి తీసుకెళుతోంది. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వ బడ్జెట్ ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్కు సుమారు రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటితో రాష్ట్రం ప్రగతి దిశగా పరుగులు పెడుతుంది’
- పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.