Share News

అసెంబ్లీ సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభం

ABN , Publish Date - May 20 , 2026 | 04:08 AM

రాష్ట్ర శాసనసభ సచివాలయ అధికారుల సామర్థ్యాభివృద్ధి కోసం ఉద్దేశించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మంగళవారం అమరావతి అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రారంభమైంది.

అసెంబ్లీ సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభం

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ సచివాలయ అధికారుల సామర్థ్యాభివృద్ధి కోసం ఉద్దేశించిన మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మంగళవారం అమరావతి అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రారంభమైంది. లోక్‌సభకు చెందిన పార్లమెంటరీ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీస్‌ (ప్రైడ్‌) సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్న కుమార్‌ ప్రారంభించారు. కొత్తగా నియమితులైన అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లకు శాసన వ్యవహారాల నిర్వహణ, ఆధునిక పరిపాలనా విధానాలు, కార్యనిర్వహణ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలపై ప్రాక్టికల్‌ అవగాహన కల్పించనున్నారు.

Updated Date - May 20 , 2026 | 04:10 AM