వ్యవసాయ సహాయ సంచాలకులకు పదోన్నతి
ABN , Publish Date - Apr 28 , 2026 | 05:15 AM
రాష్ట్ర వ్యవసాయశాఖలో 37మంది సహాయ సంచాలకుల(ఏడీ)కు ఉపసంచాలకులు(డీడీ)లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
అమరావతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయశాఖలో 37మంది సహాయ సంచాలకుల(ఏడీ)కు ఉపసంచాలకులు(డీడీ)లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2025-26 ప్యానల్ సంవత్సరంలో అర్హులైన వీరికి తాత్కాలిక పద్ధతిలో పదోన్నతి ఇచ్చి, వ్యవసాయ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.