Share News

కష్టాలు తొలగిపోతాయని.. మళ్లీ పెళ్లి!

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:55 AM

ఆ దంపతులు కొన్నేళ్ల కిందట ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఆ కుటుంబాలను ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి.

కష్టాలు తొలగిపోతాయని.. మళ్లీ పెళ్లి!

  • అన్నవరంలో పునర్వివాహం చేసుకున్న తొమ్మిది జంటలు

అన్నవరం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆ దంపతులు కొన్నేళ్ల కిందట ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఆ కుటుంబాలను ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఒక ఆస్థాన సిద్ధాంతి సూచన మేరకు సత్యదేవుడి సన్నిధిలో బుధవారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన మూడు జంటలు, అచ్యుతాపురానికి చెందిన ఆరు జంటలు బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకోగా, పురోహితులు తొమ్మిది జంటలకు మళ్లీ వివాహం జరిపించారు. కష్టాలన్నీ గట్టెక్కేందుకు సత్యదేవుడి సన్నిధిలో పునర్వివాహం చేసుకున్నామని వారు చెప్పారు.

Updated Date - Aug 20 , 2026 | 04:56 AM