పాస్పోర్టు వెరిఫికేషన్లో రాష్ట్రానికి జాతీయ అవార్డు
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:55 AM
పాస్పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణ సేవల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ పనితీరు కనబర్చింది.
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): పాస్పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణ సేవల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ పనితీరు కనబర్చింది. ఇందుకుగానూ విదేశాంగ శాఖ రాష్ట్ర పోలీసు శాఖకు ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ అందజేసింది. ‘పాస్పోర్ట్ సేవా దివస్-2026’ కార్యక్రమంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి జై శంకర్ చేతుల మీదుగా ఏపీ పోలీసు శాఖ తరఫున ఇంటెలిజెన్స్ ఎస్పీ రమాదేవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.