జనగణనకు 112 కోట్లు విడుదల
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:54 AM
రాష్ట్రంలో జనగణన కోసం ప్రభు త్వం రూ.112.12 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనగణన కోసం ప్రభు త్వం రూ.112.12 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను టెక్నికల్ అసిస్టెంట్స్ గౌరవ వేతనం, వాహనా ల పెండింగ్ బిల్లులు, మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం కింద ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.