Share News

పవర్‌ మోత మోగింది

ABN , Publish Date - May 23 , 2026 | 06:32 AM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వేసవి పరిస్థితులు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ఏపీ విద్యుత్తు సంస్థలు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్‌ను..

పవర్‌ మోత మోగింది

  • 285 కాదు 288 మిలియన్‌ యూనిట్లు

  • రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్‌

అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వేసవి పరిస్థితులు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ఏపీ విద్యుత్తు సంస్థలు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్‌ను ఎదుర్కొంటున్నాయని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యుత్తు శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్‌ తెలిపారు. రాష్ట్ర గ్రిడ్‌ 21వ తేదీ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 288.9 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగాన్ని నమోదు చేసిందని చెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు వినియోగం 285మిలియన్‌ యూనిట్లు నమోదు చేయగా, అర్ధరాత్రి12 గంటలకు 288.9మి. యూనిట్లకు చేరిందన్నారు.

Updated Date - May 23 , 2026 | 06:33 AM