పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:42 AM
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు మిగిలిన సబ్జెక్టుల తుది ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు మిగిలిన సబ్జెక్టుల తుది ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇటీవల కొన్ని సబ్జెక్టుల ఫలితాలు ప్రకటించగా, నాలుగు సబ్జెక్టుల్లో ఎనిమిది మందిని ఎంపిక చేస్తూ తాజాగా ఫలితాలు ఇచ్చింది. అలాగే కాలుష్య నియంత్రణ మండలిలో గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో పేపర్-2 సిలబస్ మార్చినట్లు తెలిపింది.