Share News

అంబేడ్కర్‌ సందేశం మార్గదర్శకం: మాధవ్‌

ABN , Publish Date - May 17 , 2026 | 05:11 AM

‘చదవండి.. సమీకరించండి.. పోరాడండి’ అన్న అంబేడ్కర్‌ సందేశం సమాజానికి మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ సందేశం మార్గదర్శకం: మాధవ్‌

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘చదవండి.. సమీకరించండి.. పోరాడండి’ అన్న అంబేడ్కర్‌ సందేశం సమాజానికి మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘దళితుల ఆత్మగౌరవ గుండెచప్పుడు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని డప్పు కళాకారులకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ కార్యక్రమంఆదివారం విజయవాడలో ముగియనుంది. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాధవ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవ గుండెచప్పుడు కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేశ్‌ ఆధ్వరంలో నిర్వహిస్తున్నామన్నారు. బందరురోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద డప్పు కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - May 17 , 2026 | 05:11 AM