రాజ్యసభలో అంబటి, జోగి అంశం ప్రస్తావన
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:01 AM
సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ల అంశాన్ని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోశ్ రాజ్యసభలో లేవనెత్తారు.
వైస్ చైర్మన్ తీవ్ర అభ్యంతరం
పద్ధతి కాదంటూ వైసీపీ ఎంపీపై ఆగ్రహం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ల అంశాన్ని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోశ్ రాజ్యసభలో లేవనెత్తారు. దీనిపై సభాధ్యక్ష స్థానంలో ఉన్న వైస్ చైర్మన్ దినేశ్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో లేని వ్యక్తుల గురించి ఇక్కడ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో పిల్లి సుభాశ్ చంద్రబోశ్ వీరిద్దరి అంశం ప్రస్తావించారు.