రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజన్
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:26 AM
రాజధాని అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది.
ప్రపంచ బ్యాంకు బృందం ఉద్ఘాటన.. సీఎంతో భేటీ
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది. బుధవారం ఆ బ్యాంకు ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్తురంగ సంస్కరణల కారణంగా ఈ నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని అభిప్రాయపడింది. వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్లు బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం చేపట్టడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు వారికి వివరించారు.