Share News

నేటి నుంచి పాత సమయానికే అష్టదళపాద పద్మారాధన

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:03 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో వారపు సేవగా ఉన్న అష్టదళపాదపద్మారాధన పూర్వపు సమయంలోనే నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి పాత సమయానికే అష్టదళపాద పద్మారాధన

తిరుమల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో వారపు సేవగా ఉన్న అష్టదళపాదపద్మారాధన పూర్వపు సమయంలోనే నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. 2022 వరకు ఉదయం 6 నుంచి 6.45 గంట ల వరకు జరిగే ఈ సేవను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు నిర్వహించేలా మార్చారు. వేకువజామునే వరుసగా సేవలన్నీ పూర్తి చేస్తే తర్వాత సాధారణ దర్శనాలను యథావిధిగా కొనసాగించవచ్చని ప్రస్తుత టీటీడీ బోర్డు, అధికారులు పాత సమయానికే అష్టదళపాదపద్మారాధనను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి అమలు కానుంది.

Updated Date - Mar 10 , 2026 | 05:03 AM