ఏపీలో 50 వేలకోట్లతో మెమొరీ చిప్స్ పరిశ్రమ!
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:22 AM
రాష్ట్రానికి మెమొరీ చిప్స్ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్కు చెందిన మెమొరీ చిప్స్ తయారీ సంస్థ ఆసక్తి చూపుతోంది.
పెట్టుబడి పెట్టేందుకు భారతీయ కంపెనీ ఆసక్తి
ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మెమొరీ చిప్స్ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్కు చెందిన మెమొరీ చిప్స్ తయారీ సంస్థ ఆసక్తి చూపుతోంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా రాష్ట్ర అధికారులు.. ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉండటంతో ఈ కంపెనీ వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ఒకప్పుడు ఎలకా్ట్రనిక్స్ పరికరాల తయారీ దిగ్గజ సంస్థ శామ్సంగ్తో పోటీ పడ్డ ఈ ఇండియన్ కంపెనీ ఇప్పుడు మెమొరీ చిప్స్ తయారీపై దృష్టి సారించింది. మెమొరీ చిప్స్ తయారీలో ప్రస్తుతం హాంకాంగ్ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో మెమొరీ చిప్స్ తయారీ సంస్థ తమ ఉత్పత్తులను ప్రారంభిస్తే క్రమంగా ఈ రంగంలోనూ పెట్టుబడులు పెరుగుతాయని ఢిల్లీలో సంప్రదింపులు జరిపిన ఓ అధికారి వెల్లడించారు. ఈ సంస్థ రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అదేవిధంగా మరో కంపెనీ కూడా రూ.4000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.