గణతంత్ర అవార్డులకు 40 మంది ఎంపిక
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:55 AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ 40 మందినిఉత్తమ అవార్డులకు ఎంపిక చేసినట్లు...
అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ 40 మందినిఉత్తమ అవార్డులకు ఎంపిక చేసినట్లు ఏపీఎల్డీఏ సీఈవో శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఉత్తమ రైతు కేటగిరిలో యు.శేషఫణి(నంద్యాల), డి.శ్రీకాంత్(తిరుపతి), సీహెచ్ అమరకృష్ణ, ఎన్.చంద్రశేఖర్(ప్రకాశం), ఎం.మురళీకృష్ణ, కె.హరిబాబు(బాపట్ల) ఉన్నారు.