నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ మహాసభలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:58 AM
అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభలు ఈ నెల 23 నుంచి 26 వరకు..
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభలు ఈ నెల 23 నుంచి 26 వరకు షిర్డీలో జరగనున్నట్టు సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. 100 మంది ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం విజయవాడ నుంచి షిర్డీకి రైలులో బయలుదేరి వెళ్లారు.