Tirumala Darshan: శ్రీవారి దర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:50 AM
పండుగ సెలవుల దృష్యా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శనివారం సర్వదర్శనం కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో బారులు తీరారు...
తిరుమల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పండుగ సెలవుల దృష్యా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శనివారం సర్వదర్శనం కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి ఆలయం ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, లడ్డూకౌంటర్, ప్రధాన కూడళ్లు, బస్టాండ్, గదులు కేటాయించే కౌంటర్లు, కల్యాణకట్టలు, యాత్రికుల వసతి సముదాయాలు.. ఎక్కడ చూసినా భక్తజనంతో నిండిపోయి కనిపించాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయి నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 14 గంటల దర్శన సమయం పడుతోంది. అలాగే స్లాటెడ్ భక్తులకూ దాదాపు మూడు గంటల తర్వాతే దర్శనం లభిస్తోంది. ఆదివారం కూడా రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.