Share News

పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 31 , 2025 | 10:34 PM

ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులతో పాటు ప్ర భుత్వ కళాశాల భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న భవ నాల పనులను నాయకులతో కలిసి పరిశీలించారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి
పనులను పరిశీలించి ఫోన్‌లో అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులతో పాటు ప్ర భుత్వ కళాశాల భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న భవ నాల పనులను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా ణ్యతతో పనులు చేపట్టాలని భవనాలు ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజ లకు నాణ్యమైన విద్య వైద్యం అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సంవత్సరం లోపు కళాశాల నిర్మాణం పనులు పూర్తి చేశామని ఈఏడాది ప్రారంభం నుంచి తిరిగి భవనం ప్రారంభించి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తె లిపారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జీసీసీ చైర్మన్‌ కొట్నాక తిరుపతి, పార్టీ ప్రెసిడెంట్‌ ఆరీఫ్‌, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెల్ల నాగభూషణం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 10:34 PM