Relationship Crime: ప్రియుడితో భర్తను చంపించిన భార్య
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:00 AM
వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని, అతడిని తన ప్రియుడితో కలిసి చంపించిందా భార్య. ఆపై ప్రియుడితో కలిసి ఘటనను రోడ్డు...
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే దారుణం
ఆమె, ప్రియుడు అరెస్టు.. సహకరించిన మరో ఇద్దరు
నాగర్కర్నూల్ క్రైం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని, అతడిని తన ప్రియుడితో కలిసి చంపించిందా భార్య. ఆపై ప్రియుడితో కలిసి ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. నాగర్కర్నూల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రూరల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాముడు (37)కు, పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్లకు చెందిన మానసతో 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులు నాగర్కర్నూల్లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆరు నెలల క్రితం మానసకు పెద్దముద్దునూర్కు చెందిన సురేశ్ గౌడ్తో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని మానస నిర్ణయించుకుంది. ప్రియుడు కౌకుంట్ల సురేశ్గౌడ్తో కలిసి పథకం వేసింది. ఈనెల 11న పెద్దమద్దనూర్లో పార్టీ ఉందని.. రాముడికి సురేశ్ ఫోన్ చేసి చెప్పాడు. రాముడు పెద్దముద్దునూరుకు వెళ్లాక అందరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత సురేశ్.. తన వెంట తెచ్చుకున్న పెద్ద ప్లాస్టర్ను రాముడి ముక్కు, నోటిపై అతికించాడు. దీంతో అతడు ఊపిరి ఆడక చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కంకర రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. తన కుమారుడు మృతిపై అనుమానం ఉందంటూ పోలీసులకు రాముడి తండ్రి ఫిర్యాదు చేయగా.. అసలు విషయం బట్టబయలైంది. ఆమెతో పాటు, ప్రియుడు సురేశ్ సహకరించిన బాలపీరు, హనుమంతును అరెస్టు చేశారు.