Share News

Yadagirigutta: యాదగిరిగుట్టపై భక్తుల కిటకిట

ABN , Publish Date - May 25 , 2025 | 05:09 AM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భారీ భక్తులు తరలివచ్చారు. సుమారు 45వేల మంది భక్తులు దర్శించుకోగా ఆలయానికి రూ.49.77 లక్షల ఆదాయం సమకూరింది.

Yadagirigutta: యాదగిరిగుట్టపై భక్తుల కిటకిట

యాదగిరిగుట్ట, మే 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం వారాంతపు రద్దీ కనిపించింది. భారీగా వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట కిటకిటలాడింది. స్వామివారిని సుమారు 45వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వాహనాలతో కొండపై పార్కింగ్‌ స్థలం నిండిపోయింది. భక్తులు క్యూలైన్లలో రాత్రి వరకు బారులు తీరారు. కాగా, శనివారం ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.49,77,624 ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 05:09 AM