పాఠశాలల పనితీరును మెరుగుపరుస్తాం
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:32 PM
ఈ నెల 11న అంగన్వాడీలు, 12 నుంచి పాఠశాలలు పు నఃప్రారంభించనున్న నేప థ్యంలో ఆకస్మిక తనిఖీలు చేసి పాఠశాలల పనితీరు ను మెరుగుపరుస్తామని క లెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీసీలో కలెక్టర్ సంతోష్
నాగర్కర్నూల్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 11న అంగన్వాడీలు, 12 నుంచి పాఠశాలలు పు నఃప్రారంభించనున్న నేప థ్యంలో ఆకస్మిక తనిఖీలు చేసి పాఠశాలల పనితీరు ను మెరుగుపరుస్తామని క లెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హై దరాబాదు నుంచి పంచా యతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృ ష్ణారావు జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమావేశం నిర్వహించారు. జి ల్లా నుంచి కలెక్టర్ బదావత్ సంతోష్, అదన పు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి వీసీలో పాల్గొన్నారు. సీఎస్ రామకృష్ణారావు, మంత్రి సీతక్క మాట్లాడుతూ మాట్లాడుతూ పాఠశాలల పునర్ప్రారంభ చర్యలు, పాఠ్యపు స్తకాల పంపిణీ, పౌర విద్యుత్ ప్లాంట్లు, పెట్రో లు పంపులు ఏర్పాటు, స్వయం సహాయ భవ నాల నిర్మాణం, మహిళా సంఘాల్లో కోటి మం ది మహిళలను చేర్చడం తదితర అభివృద్ధి, సం క్షేమ పథకాల పురోగతిని జిల్లా ఉన్నతాధికా రులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్ సెక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దు
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండిం గ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించా లని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆ దేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి మొత్తం 35 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ సమ స్యలపై అందిన వినతులను అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవహాయంతో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.