మహేంద్రనాథ్ అడుగుజాడల్లో నడవాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:27 PM
మాజీ మంత్రి మహేంద్రనాథ్ అచ్చంపేటకు చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ - పుట్టపాక జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళి
అచ్చంపేటటౌన్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి మహేంద్రనాథ్ అచ్చంపేటకు చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆయన 99వ జయంతి పుర స్కరించుకొని మంగళవారం పట్టణంలోని ఆయ న విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పిం చారు. పుట్టపాక మహేందర్నాథ్ అడుగు జాడ ల్లో ప్రతీ ఒక్కరు నడవాలని అన్నారు. అనంత రం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎంపికైన సందర్భంగా పార్టీ నాయకులు ఆయనను శాలువాలతో స త్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా చైర్మన్ రాజేందర్, మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, నాయకు లు పోకల మనోహర్, తులసీ రాం, మల్లేష్, రామనాథం, గో పాల్రెడ్డి, యూత్కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్, నాయకులు కాశన్నయాదవ్, మ హబూబ్ అలీ, గౌరీశంకర్, శేఖర్, తిరుపతయ్య, రాములు పాల్గొన్నారు.
మహోన్నతుడు మహేంద్రనాథ్
నాగర్కర్నూల్ : సమాజంలోని అణగారిన వ ర్గాల కోసం అనునిత్యం శ్రమించిన మాజీ మం త్రి పుట్టపాగ మహేంద్రనాథ్ మహోన్నతుడని దళిత సంఘం రాష్ట్ర నాయకుడు వంకేశ్వరం నిరంజన్ కొనియాడారు. మంగళవారం పుట్టపా గ మహేంద్రనాథ్ జయంతి సందర్భంగా జాతీ య ఉన్నత పాఠశాల ఆవరణలోని ఆయన విగ్ర హానికి పూలమాలలు వేసి అన్ని వర్గాలకు చెంది న ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహేంద్రనాథ్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు వంకేశ్వరం శ్రీనివా సులు, కొత్త పరుశరాములు, ఐటీఏ ప్రిన్సిపాల్ సమీఉల్లాఖాన్, వడ్డెమాన్ విష్ణుమూర్తి, కొత్త గంగాధర్, పై నిరంజన్, వి.వెంకటస్వామి, మిద్దె భాస్కర్, వెంకటయ్య, శివ, ఎల్లయ్య, స్వామి, చంద్రశేఖర్, నరేష్, రవి, జాతీయ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.